ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలను గురువారం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ చేశారు. అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ తదితరులు ఉన్నారు.