ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట ఇసుక క్వారీ నుండి అధిక లోడుతో వస్తున్న లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పేరూరు ఎస్సై రమేష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం. అయ్యవారిపేట క్వారీ నుండి ఉండాల్సిన లోడు కంటే సుమారుగా 5 టన్నుల ఇసుకను అధికంగా లోడ్ చేసుకుని వస్తున్నట్లు తెలిపారు. దీంతో లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.