సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి సీతక్క

56చూసినవారు
సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి సీతక్క
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు ఏటూరునాగారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి హాజరయ్యారు. డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్