ప్రజలు వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: అప్పయ్య

65చూసినవారు
ప్రజలు వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: అప్పయ్య
ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున జిల్లాలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య మంగళవారం సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని, వ్యక్తికి వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. సాధ్యమైనంతవరకు ఎండలో బయటకు వెళ్లడం ఆపివేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్