వాజేడు మండలంలో పోలీసులు అలర్ట్

78చూసినవారు
వాజేడు మండలంలో పోలీసులు అలర్ట్
ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల, చంద్రుపట్ల గ్రామాల్లోని ప్రధాన రహదారులపై ఎస్సైలు రమేష్, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలను చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వారు తెలిపారు. వాజేడు, వెంకటాపురం మండలాలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు గనుక పోలీసులు అలర్ట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్