అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

73చూసినవారు
భార్య, బిడ్డల ముందు గ్రామస్తులు కొట్టారన్న అవమానం భరించలేక ఓ వ్యక్తి బుధవారం ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో పురుగుల మందు తాగాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మల్లంపల్లి గ్రామానికి చెందిన దోమల రాజేశ్ ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో 20 రోజుల క్రితం పిల్లలను తీసుకొని తన భార్య మల్లంపల్లిలోని పుట్టింటికి వెళ్లినట్లు రాజేశ్ వీడియోలో వివరించాడు. బుధవారం ఉదయం తన బిడ్డ, కొడుకు అత్తగారి ఇంటి వద్ద కాకుండా ఓ వాటర్ ప్లాంట్ వద్ద కనిపించడంతో వారిని మందలిస్తుండగా తనపై మల్లంపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టారని ఆవేదన వెలిబుచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్