24 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయ్: మంత్రి

77చూసినవారు
24 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయ్: మంత్రి
రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ఖాతాలో డబ్బులు జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి శేషయ్య అనే రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేశాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని అనడానికి ఇదే తార్కాణం' అని నాదెండ్ల ట్వీట్టర్‌లో పోస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్