విద్యుత్ షాక్ తో రైతు మృతి

544చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కౌడ్తిమాటు తండా విషాదం చోటు చేసుకుంది. సోమవారం జొన్న చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో భానోత్ చందర్ (50)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పంటచేను వద్దకు వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో వెళ్లి పొలం వద్ద చూడగా చనిపోయి ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఖానాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్