పట్టణంలోని 250 పడక ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం రెవెన్యూ ఇంజనీరింగ్ వైద్య అధికారులతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్మాణంలో ఉన్న 250 పడకల ఆసుపత్రిని సందర్శించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేశారు.