పాలకుర్తి సోమన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

54చూసినవారు
జనగాం జిల్లా మండల కేంద్రమైన పాలకుర్తిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. సోమవారం ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శన అనంతరం ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. పాలకుర్తి సోమన్నను దర్శనం చేసుకునేందుకు ప్రతి సోమవారం భక్తులు వేల సంఖ్యలో వస్తారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్