పరకాల బస్టాండ్ ఆవరణలో పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని దాహాన్ని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సీఐ పరకాల రవిరాజు ని ఏ సి పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ దేవేందర్, రవీందర్, ప్రజలు పాల్గొన్నారు.