ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో మాట్లాడుతూ.. ‘ఆప్కు చెందిన పలువురు నేతలు జైలులో ఉన్నారు. వారికి ‘కత్తెర బాయిమన్’ అనే పేరు కూడా ఉంది. వీరి అవినీతిని చూసి ఢిల్లీ ప్రజలు తాము మోసపోయామని తెలుసుకున్నారు. ఆప్ నేతలు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి ఓట్లు పొందారే తప్ప.. అభివృద్ధి చేయలేదు’ అని అన్నారు.