పరకాల పురపాలక సంఘం ఒకటో వార్డు పరదిలోని సి ఎస్ ఐ మిషన్ పాఠశాలను స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సందర్శించి మధ్యాహ్న భోజన పథకమును పరిశీలించి స్వయంగా పిల్లలకు భోజనం వడ్డించి పిల్లలతో కలిసి భోజనం చేసి స్కూల్ యాజమాన్యానికి తగు సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలకు అందించే ఆహారం నాణ్యతగా కలిగి ఉండాలని మెనూ ప్రకారం వారికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.