ఉగ్రదాడిలో 95 మంది అదృశ్యం

82చూసినవారు
ఉగ్రదాడిలో 95 మంది అదృశ్యం
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో 95 మంది అదృశ్యమయ్యారని ఓ రష్యా వార్తా సంస్థ తెలిపింది. క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన దాడిలో140 మంది మృతిచెందగా.. 182 మంది గాయపడ్డారు. అయితే వీరు కాకుండా దాడి సమయంలో అక్కడే ఉన్న మరో 95 మంది ఆచూకీ లభించలేదని వార్తా సంస్థ ప్రచురించింది. అదృశ్యమైన వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్