ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు

78చూసినవారు
ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు
స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండకు చెందిన జోగు కుమార్, జోగు సమయ్యలపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు కలిసి ఓ మహిళకు ప్రభుత్వం నుంచి రైతుభీమా ఇప్పిస్తామని చెప్పి నమ్మించి జిరాక్స్ పత్రాలను తీసుకున్నారు. ఆ మహిళా బ్యాంకు ఖాతాలో ఐదు లక్షలు జమ కాగానే ఆమెకు తెలియకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్