గుండెపోటు తో టిఆర్ఎస్ నాయకుడి మృతి

1441చూసినవారు
గుండెపోటు తో టిఆర్ఎస్ నాయకుడి మృతి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం టిఆర్ఎస్ నాయకుడు మునిగల సురేందర్ గుండే పోటు తో హన్మకొండ లోని ఒక ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు ధర్మసాగర్ మండలం తన స్వంత గ్రామమైన దర్మపురంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేందర్ ఆకస్మిక మృతి పట్ల వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు స్థానిక శాశన సభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య కు ప్రధాన అనుచరుడు. సురేందర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్