వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గనిపాక ప్రదీప్ మాదిగ బుధవారం ఖిలవరంగల్లో జరిగిన ఏంహెచ్డి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా మాదిగ లకు రావాల్సిన అన్ని పదవులు లాక్కొని అనుభవించి మాదిగలు రాజకీయంగా ఎదగకుండా అణిచివేసిన మాదిగల రాజకీయ శత్రువు కడియం శ్రీహరి అని అన్నారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య కు ఓటమి తప్పదని హెచ్చరించారు.