ఎంజీఎంలో పనిచేయని డిజిటల్ ఎక్స్ రే

52చూసినవారు
వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో డిజిటల్ ఎక్స్రే మిషన్ పనిచేయక మూడు రోజులవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి ఎక్స్రే మిషన్ మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. కాగా, అధికారులు మరమ్మతు చేయించడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రోగులు, అటెండెంట్లు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్