వరంగల్లో 19న మిలాద్ ఉన్ నబీ

52చూసినవారు
సెప్టెంబర్ 19న మిలాద్ ఉన్ నబీ నిర్వహించాలని శాంతి కమిటీ, ముస్లిం మత పెద్దలు నిర్ణయించారని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు. ఎల్బీనగర్లో శనివారం సాయంత్రం పోలీసు అధికారులు ముస్లిం మతపెద్దలు, శాంతి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా. అదేరోజు గణేశ్ నిమజ్జనం ఉన్నందున 19న నిర్వహించేందుకు పెద్దలందరూ అంగీకరించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్