వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి తిరు కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా గుట్టపైకి తీసుకొచ్చారు. భక్తులకు మహాన్నదానం, మజ్జిగ, పానకం పంపిణీ చేశారు. ఆలయ ప్రధానార్చకులు వరయోగుల శ్రీనివాసస్వామి, వేణుస్వామి, చింతాకుల సునీల్, జారతి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.