వరంగల్ నగరంలో గత వారం రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి చక్కటి వ్యాయామం కోసం స్విమ్మింగ్ చేయడానికి బయలుదేరుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా చెరువుల బాట పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చెరువులు, కుంటల్లో ఈతకు వెళుతున్నారు. ఈతకు వెళ్లే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు.