హనుమకొండ గుండ్ల సింగారంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తో పాటు అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, ఆవరణ పరిసరాలు, అంగన్వాడీ కేంద్రంలోని గదులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం గురించి ఎలా ఉంటుందని వివరాలను అడిగి తెలుసుకున్నారు.