భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచన మేరకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో శుక్రవారం సత్యా గ్రహ దీక్ష నిర్వహించారు. బిజెపి వరంగల్ జిల్లా నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రైతుల సమస్యలు తీరుస్తామని తెలిపి రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.