2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లు ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ’ పేరిట మేనిఫెస్టోను ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. కుల గణన, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.6వేలు, రూ.450కి గ్యాస్ సిలిండర్ తదితర హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.