విద్యార్థులు పరీక్ష ఫలితాలు వెలువడినప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని, 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడే నేపథ్యంలో విద్యార్థులు ఫెయిల్ అయితే ఎటువంటి ఒత్తిడికి లోనవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. బి. సాంబశివ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఫెయిల్ అయితే పట్టుదలతో చదివి సప్లమెంటరీ పరీక్షలు రాసి పాస్ కావాలి తప్ప ఆత్మహత్య లాంటి ప్రయత్నాలకు పాల్పడవద్దన్నారు.