AP: పింఛన్దారులకు గుడ్ న్యూస్. ఈ నెల 30, 31, ఏప్రిల్ 1న బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేస్తారు.