రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం ఛలో నల్గొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ మళ్ళీ డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నదుల నీళ్లపై తనకు అవగాహన లేదని, నన్ను అడిగితే నేను చెబుతానంటూ ఆయన చెప్పుకొచ్చారు.