ఇటీవల అమ్మాయిల మోజులో పడి అబ్బాయిలు, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు గొడవలు పడిన ఘటనలు సోషల్ మీడియాలో వైరాల్ అవడం చూసే ఉంటాం. తాజాగా ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీనికి గల కారణం ఓ యువతి అని తెలుస్తోంది. నడి రోడ్డు మీద ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కాసేపు దుర్భాషలాడుకున్నారు. అనంతరం ఓ వ్యక్తి కళ్ళజోడు పెట్టుకున్న యువకుణ్ణి బలంగా నెట్టివేయడంతో మొదలై.. చివరకు రోడ్డుపై పడి కొట్టుకునే వరకు వెళ్ళింది. కాగా ఇక్కడ వారిని పలువురు ప్రోత్సహించడం గమనార్హం.