ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూసేందుకు బెంగుళూరు స్టేడియంకు వెళ్లిన యువతి మొబైల్లో ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ చూసింది. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్ను చూడటం మానేసి యువతి తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూర్చోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.