తుక్కుగూడ సభ కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకం. మేనిఫెస్టో విడుదల రీత్యానే కాక.. దక్షిణాదిన అత్యధిక సీట్లు వచ్చే రాష్ట్రం తెలంగాణనే. అయితే తుక్కుగూడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభకు ఏపీ పీసీసీ చీఫ్గా నియమితులైన వైఎస్ షర్మిల హాజరుకాలేదు. ఏపీలో ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయినప్పటికీ తుక్కుగూడ సభకు రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ అగ్ర నేత రాహుల్ పాల్గొన్న సభకు ఏపీలోని పార్టీ అధ్యక్షురాలిని ఆహ్వానించారా? లేదా? అనేది తెలియరాలేదు.