ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలు తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని ప్రజలు విశ్వసిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. గ్రామ నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించి.. ఆ వైశాల్యానికి మధ్యభాగంలో ఈ బొడ్రాయిని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజిస్తారు. పొలిమేర్లలో దిక్కుల వారీగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను, సర్వతోభద్ర యంత్రాన్ని భక్తిపూర్వకంగా స్థాపన చేస్తారు.