తెలంగాణ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎందుకు ఉండాలి? అంటూ కాంగ్రెస్ నేత, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పేరును ముద్రించిన అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. కేసీఆర్ పేరు ఉంటే తప్పేమీ? అని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.