ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్

59చూసినవారు
ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్
ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగిలింది. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకూ మద్యం షాపులు మూసివేయాలని డీజీపీ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకే వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్