ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నవజాత శిశువును ఎత్తుకెళ్లిన మహిళ (వీడియో)

50చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి గదిలో ఉన్న నవజాత శిశువును ఒక మహిళ దర్జాగా ఎత్తుకెళ్లిన ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. బేగుసరాయ్ జిల్లా లోహియా నగర్‌కు చెందిన నందినీ దేవి ఆదివారం స్థానిక ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఆ పసికందును ప్రత్యేక వార్డులో ఉంచారు. సాయంత్రం శిశువుకు పాలు పట్టేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు పసికందు కనిపించలేదు. దాంతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్