ముంబైలోని ఖండీవాలి ప్రాంతంలో శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. సురేంద్ర గుప్తా అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అయితే బ్రేక్కు బదులుగా పొరపాటుగా యాక్సిలరేటర్ను ఉపయోగించాడు. దీంతో ఓ మహిళ సహా ముగ్గురిని ఆ కారు ఢీకొట్టింది. కారు కింద పడి మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.