ఇండోనేషియాలో విషాదం నెలకొంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని కలెమ్పాంగ్ గ్రామానికి చెందిన ఫరీదా అనే మహిళ గురువారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె భర్త వెతుకుతున్న సమయంలో ఓ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన వస్తువులను గుర్తించాడు. ఆ ప్రాంతంలో గాలించగా, ఓ కొండచిలువను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కొండచిలువ కడుపు తెరిచిచూడగా, ఫరీదా చనిపోయి కనిపించింది.