బ్రెజిల్లో ఓ షాకింగ్ ఘటన చోసుచేసుకుంది. కూతురి కళ్ల ముందే ఓ మహిళను దుండగులు కాల్చి చంపారు. బ్రెజిల్లోని పారా రాష్ట్రంలో ఉన్న స్నాక్ బార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపై వేచి ఉండగా, ఆమె కుమార్తె బార్లోకి వెళ్లి ఏదో కొనబోతోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు మహిళపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళ అక్కడికక్కడే మరణించింది. కాగా, దాడి చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.