తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై సోమవారం సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వాటిపై చర్యలు తీసుకోవడంతో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని ఏపీ, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. మార్చి 7న విచారణకు వర్చువల్గా హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన రిట్పై సుప్రీం విచారణ చేపట్టి.. ఈ మేరకు తీర్పునిచ్చింది.