యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

73చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్