RTC అధికారులపై ప్రభుత్వ విప్ బీర్ల ఫైర్

58చూసినవారు
RTC అధికారులపై మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. ప్రయాణికుల నుండి ఆర్టీసీ అధికారుల మీద చాలా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. జెడ్పీ సమావేశంలో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యం కొరకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులన్నీ ప్రజలకు అందాలన్నారు. ప్రయాణికులకు ఆపవలసిన చోట కచ్చితంగా బస్సులను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్