యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా, వేగంగా జరుగుతున్నాయని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి. బెన్ శాలోమ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 8483 మంది రైతుల నుండి 85, 549 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 35 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు.