దేశీయ మార్కెట్లోకి యమహా మోటర్ మరో స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.