AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించారు. ‘ఆంధ్రులు ఉన్నంత కాలం పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీరాములు జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.