శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఓ వ్యక్తి మద్యం మత్తులో బస్సు వెనుక ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని ప్రమాదకరంగా ప్రయాణించాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున కొందరు ఇది గమనించి బస్సు డ్రైవర్కు చెప్పారు. డ్రైవర్ బస్సు ఆపి చూడగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. అతనికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో డ్రైవర్, కండెక్టర్ విజయలక్ష్మితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.