కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. "పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరలా జల్లు కురిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,917 కోట్లు ఇచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారులో స్టీల్ ప్లాంట్కు రక్షణ కలిగింది." అని విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు.