తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జీరో అవర్లో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పలు విషయాలను ప్రస్తావించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఊసే లేకుండా పోయిందని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ 80 శాతం పూర్తయిందన్నారు. షాద్నగర్కు సాగు, తాగు నీరు రాలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయని, అర్హులకు వెంటనే అందించాలన్నారు.