ఏలూరు జిల్లా దెందులూరు నియోజవకర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొప్పులవారిగూడెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడు రాజేష్ను పెదవేగి పోలీసులు స్టేషన్ పిలిపించారు. అతడిపై పలు సెక్షన్లతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే స్టేషన్కు వచ్చిన చింతమనేని ప్రభాకర్.. రాజేష్ను తీసుకెళ్లిపోయారు. దాంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.