అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలో ఆటో -బైక్ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ చేదుపుట్టు గ్రామస్తులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.