ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై పెంటిభద్ర జంక్షన్ దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా కొట్టింది. పలాస మండలం రంగోయికి చెందిన ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.