ఏపీ ఎన్నికల్లో కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్కు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపు పట్ల అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.